యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదా

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదా

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉండటంతో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) కీలక నిర్ణయం తీసుకుంది. UPSC ప్రిలిమ్స్‌ పరీక్షలను వాయిదా వేసింది. ఈ ఏడాది జూన్‌ 27న జరగాల్సిన పరీక్షను అక్టోబర్‌ 10న నిర్వహించాలని నిర్ణయించినట్టు కమిషన్‌ ప్రకటించింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు UPSC తెలిపింది.

గతేడాది కూడా కరోనా కారణంగా సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలను వాయిదా వేసింది. మే 31న జరగాల్సిన ఈ పరీక్షలను కరోనాతో అక్టోబర్‌ 4కు రీషెడ్యూల్‌ చేశారు. ప్రస్తుతానికి రాత పరీక్షలు పూర్తయినప్పటికీ.. ఇంటర్వ్యూలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు, ప్రస్తుతం వైరస్‌ విజృంభిస్తుండటంతో UPSC అన్ని పరీక్షలను వాయిదా వేసింది.