దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉండటంతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కీలక నిర్ణయం తీసుకుంది. UPSC ప్రిలిమ్స్ పరీక్షలను వాయిదా వేసింది. ఈ ఏడాది జూన్ 27న జరగాల్సిన పరీక్షను అక్టోబర్ 10న నిర్వహించాలని నిర్ణయించినట్టు కమిషన్ ప్రకటించింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు UPSC తెలిపింది.
గతేడాది కూడా కరోనా కారణంగా సివిల్ సర్వీసెస్ పరీక్షలను వాయిదా వేసింది. మే 31న జరగాల్సిన ఈ పరీక్షలను కరోనాతో అక్టోబర్ 4కు రీషెడ్యూల్ చేశారు. ప్రస్తుతానికి రాత పరీక్షలు పూర్తయినప్పటికీ.. ఇంటర్వ్యూలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు, ప్రస్తుతం వైరస్ విజృంభిస్తుండటంతో UPSC అన్ని పరీక్షలను వాయిదా వేసింది.